కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రభావం కారణంగా సికింద్రాబాద్ మారేడ్ పల్లి పరిసారాల్లోని మహేంద్ర హిల్స్ లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో తొలి కరోనా కేసు ఇక్కడే నమోదు కావడంతో మహేంద్ర హిల్స్లో వైరస్ విస్తరించకుండా బాధితుడి ఇంటి నుండి 5 కిలోమీటర్ల పరిధిలో హెల్త్ అలర్ట్ను ప్రకటించారు.
కంటోన్మెంట్ బోర్డు అధికారులు జీహెచ్ఎంసీ సిబ్బంది వైరస్ నివారణలో భాగంగా ముమ్మరంగా పారిశుద్ద్య చర్యలు చేపట్టింది. 19 ఫిబ్రవరి 2020న దుబాయ్ నుండి బెంగళూరుకు వచ్చి 22న మహేంద్ర హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్న ఆ యువకుడు 5 రోజులపాటు అక్కడే ఉన్నాడు.
అయితే అతనికి ఎవరెవరు కలిశారు, అతనెక్కడికి వెళ్ళాడు మొదలగు అన్ని విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులను పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో ఉంచారు.
ప్రస్తుతం బాధితునికి గాంధీ ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులో వైద్యం చేస్తున్నారు.