హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా శానంపూడి సైదిరెడ్డి

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా శానంపూడి సైదిరెడ్డినే తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు.

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోడా ప్రకటించారు.

2018 అసెంబ్లీ సాదారణ ఎన్నికల్లో సైదిరెడ్డి హుజుర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

హుజుర్‌నగర్‌ ఉపఎన్నిక ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ విడుదల: 23 సెప్టెంబర్ 2019

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2019

నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబరు 3, 2019

ఎన్నికలు: అక్టోబరు 21, 2019

ఫలితాలు: అక్టోబరు 24, 2019