వైజాగ్ టెస్టు దక్షిణాఫ్రికా 431 ఆలౌట్ – రవిచంద్రన్ అశ్విన్ ఏడు వికెట్లు

వైజాగ్ టెస్టు దక్షిణాఫ్రికా 431 ఆలౌట్

వైజాగ్ టెస్టు: వైజాగ్ వేదికగా భారత్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 431 పరుగులకు (131.2 ఓవర్లు) ఆలౌట్ అయింది. 4వ రోజు 385/8తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సౌతాఫ్రికా మొదటి సెషన్లో మరో 46 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది.

తమ మొదటి ఇన్నింగ్స్‌ని 502/7వద్ద డిక్లేర్ చేసిన భారత్ కు 71 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
డీన్ ఎల్గర్ 160 పరుగులు (287 బంతుల్లో 18×4, 4×6), డికాక్ 111 పరుగులు (163 బంతుల్లో 16×4, 2×6)   సెంచరీలు సాదించారు.

టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఏడు వికెట్లతో సత్తా చాటారు. జడేజా రెండు, ఇషాంత్ ఒక వికెట్ చేజిక్కించుకున్నారు.
ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్ (215), రోహిత్ శర్మ (176) శతకాలతో రాణించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *