జగన్నన్న వసతి దీవెన పథకం అర్హులైన అభ్యర్థుల జాబితా, ఎలా దరఖాస్తు చేసుకోవాలి

0
జగన్నన్న వసతి దీవెన పథకం అర్హులైన అభ్యర్థుల జాబితా

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 24 ఫిబ్రవరి 2020న విజయనగరంలో జగన్నన్న వసతి దీవెన (జెవిడి) పథకంను ప్రారంభించబోతున్నారు. జగన్న విద్యా దీవేనా పథకం యొక్క తుది అర్హత జాబితా అందుబాటులో ఉంది. కాబట్టి, అర్హత గల జాబితాను తెలుసుకోవడానికి క్రింద ఇవ్వబడిన లింకుల ద్వారా తెలుసుకోండి.

జగన్నన్న వసతి దీవెన పథకం అర్హులైన అభ్యర్థుల జాబితా

‘జగన్నన్న వసతి దీవెన పథకం’ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ మొదలగు ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే వారికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటుగా వసతి, భోజన ఖర్చుల కొరకు ప్రతీ ఒక్క విద్యార్థికి సంవత్సరానికి ఈ పథకం కింద విద్యార్థులకు రూ .20 వేల ఆర్థిక సహాయం అందుతుంది.

బి.టెక్, బి.ఫార్మసీ, ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బి.ఎడ్ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సులభతరం చేయడానికి ‘జగన్నన్న వసతి దీవెన’ పథకాన్ని ఎపి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డులు కూడా అర్హులకు సరఫరా చేయనున్నారు.

జగన్నన్న విద్యా దీవెనా పథకం కింద పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000, ఐటీఐ విద్యార్థులకు రూ.10,000, గ్రాడ్యుయేట్ డిగ్రీ, మరియు ఇతర కోర్సులకు రూ.20,000 అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఏడాదికి రెండు విడతలుగా అర్హులైన విద్యార్థుల తల్లి ఖాతాలో మాత్రమే ఈ మొత్తాన్ని జమ చేస్తుంది ప్రభుత్వం.

విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన తుది అర్హత జాబితా (జగన్నన్న వసతి దీవెన పథకం అర్హులైన అభ్యర్థుల జాబితా)

  1. మొదటగా మీ సెక్రటేరియట్ కోడ్ తెలుసుకోండి. అందుకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి.
  2. ఆ తరువాత మీ “జిల్లా పేరు” ను ఎంచుకుని, ఆపై మీ లొకేషన్ ఎంచుకుని గ్రామీణ లేదా పట్టణాన్ని (Rural/ Urban) ఎంచుకోవాలి.
  3. ఇక్కడ మీరు మీ అర్హత జాబితాను పరీక్షించుకోవచ్చు.
  4. ఈ లింక్ ఓపెన్ చేయండి.. https://navasakam1.apcfss.in/NavasakamJVDEligibleReport.do?key=GetEligiblePdf&sec_code=”మీ సెక్రటేరియట్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి

జగన్నన్న విద్యా దీవెనా పథకానికి ఎవరు అర్హులు

  1. షెడ్యూల్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బిసి), కాపు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఇబిసి), మైనారిటీలు మరియు దివ్యాంగ వర్గాల అర్హులైన విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాన్ని అమలు చేస్తోంది. మరియు ఫీజు తిరిగి చెల్లించబడుతుంది.
  2. 10 ఎకరాల చిత్తడి నేల, 25 ఎకరాల పోడు భూమి ఉన్నవారు.
  3. విద్యార్థి యొక్క వార్షిక కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షల కన్నా తక్కువ లేదా సమానంగా ఉండాలి.
  4. పారిశుద్ధ్య పనుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు (ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ పెన్షన్లు అందుకునే వారు అర్హులు కాదు) మరియు వృత్తిపరంగా టాక్సీ, ఆటో, ట్రాక్టర్‌ వంటి వాటిపై ఆధారపడిన వారికి ఆదాయ పరిమితి లేదు. అయితే, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ పథకం వర్తించదు.
  5. పట్టణా ప్రాంతాల్లో ఉండే వారికి 1500 చదరపు అడుగులకు మించి భవనం ఉండకూడదు (నివాస లేదా వాణిజ్య).

జగన్నన్న విద్యా దీవెనా పథకం కొరకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

జగన్నన్న విద్యా దీవెనా పథకం కోసం ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు అభ్యసించే కళాశాల యాజమాన్యం అర్హత కలిగిన విద్యార్థుల పూర్తి వివరాలను జ్ఞానభూమి వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేస్తారు.

ఆదాయ పరిమితులు సడలించిన నేపథ్యంలో తహశీల్దార్‌ ఇచ్చిన అధికార ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంకా మిగతా అర్హులైన అభ్యర్థుల వివరాలు అప్లోడ్ చేస్తారు.

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here